జాతీయ వార్తలు

టీడీపీలో ఇక మిగిలేది చంద్రబాబు, లోకేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 20 : తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తప్ప ఎవ్వరు ఉండరని మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ చెప్పారు. గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో నియంతృత్వం పెరిగిపోవటం వల్లే టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారని ఆయన తెలిపారు. తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు గత రెండు నెలల నుండి బీజేపీలో చేరడం గురించి ఆలోచిస్తున్నారు.
లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం ఈ ఆలోచనలు కార్యరూపం దాల్చాయని లక్ష్మీప్రసాద్ అన్నారు. తెలుగుదేశం నాయకులందరూ అవమానాలకు గురవుతున్నారు.. ఈ అవమానాలను భరించలేకే పార్టీకి రాజీనామా చేస్తున్నారని ఆయన అన్నారు.