జాతీయ వార్తలు

కుక్కకు ‘బుద్ధి’ చెప్పేందుకు కూనలను చావబాదిన మహిళ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మార్చి 21: ఉత్తరాఖండ్‌లో కొద్ది రోజుల క్రితం బిజెపికి చెందిన ఎమ్మెల్యే ఒకరు పోలీసు గుర్రంపై ‘ప్రతాపాన్ని’ ప్రదర్శించి దాని కాలు విరగ్గొట్టిన సంఘటన తెర మరుగు కాకముందే ఇప్పుడు కర్నాటకలో కూడా ఇదేవిధమైన ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర రాజధాని బెంగళూరులోని కృష్ణానగర్‌లో పొన్నమ్మ అనే మహిళ అభం, శుభం తెలియని ఎనిమిది కుక్కపిల్లలను బండకేసి చావబాది తన కర్కశత్వాన్ని ప్రదర్శించింది. ఇంటి గేటు కింద మురుగు కాల్వలో ఈనిన కుక్కకు ‘బుద్ధి’ చెప్పేందుకే ఆమె ఈ నెల 15వ తేదీన ఈ దుశ్చర్యకు పాల్పడిందని, ఈ ఘటనలో ఏడు కుక్కపిల్లలు అదే రోజు చనిపోగా, మరో కుక్కపిల్ల ఆ మరుసటి రోజు ప్రాణాలు విడిచిందని ‘బెంగళూర్ మిర్రర్’ పత్రిక వెల్లడించింది. మృతి చెందిన కుక్కపిల్లలను స్థానికులు పూడ్చివేసి పొన్నమ్మ నిర్వాకంపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆమెపై జంతు సంరక్షణా చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఇదిలావుంటే, పొన్నమ్మ కర్కశత్వానికి పిల్లలను కోల్పోయిన వాటి తల్లి ‘అమ్ము’ (4) ఇప్పటికీ వాటిని పూడ్చేసిన ప్రదేశంలో తిరుగుతూ రోదిస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.