జాతీయ వార్తలు
రాష్ట్రపతి కోవింద్, రక్షణ మంత్రితో గవర్నర్ నరసింహన్ భేటీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 21 August 2019
న్యూఢిల్లీ, ఆగస్టు 20: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను తెలంగాణ గవర్నర్ నరసింహన్ కలిశారు. దేశ రాజధాని ఢిల్లీ పర్యాటనలో ఉన్న గవర్నర్ మంగళవారం రాష్టప్రతి, కేంద్ర రక్షణ మంత్రితో భేటీ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులు, తదితర అంశాలపై వారితో చర్చించారు. త్వరలో జరగబోయే గవర్నర్ల సదస్సు గురించి రాష్ట్రపతి తో ప్రధానంగా చర్చించినట్టు తెలిసింది. సతీమణి విమలతో కలిసి బిహార్లో బుద్ధగయ పర్యటనలో ఉన్న ఆయన సోమవారం అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స పొందిన తరువాత నరసింహన్ ఢిల్లీకి వచ్చారు.