జాతీయ వార్తలు

విజయసాయి వ్యాఖ్యలపై ఎంపీ సుజనా ఖండన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 21: పోలవరం రివర్స్ టెండరింగ్, పీపీఏల పునఃసమీక్షలపై వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఆరోపించారు. సుజనా చౌదరి ఢిల్లీలో ఆయన నివాసంలో బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని మార్చాలని చూస్తే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని అభిప్రాయపడ్డారు. అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ ఒకటి మాట్లాడితే, మరొక మంత్రి అవంతి శ్రీనివాస్ మరొకటి అంటున్నారని తెలిపారు. అలాగే విజయసాయిరెడ్డి మరోలో మాట్లాడుతున్నారని సుజనా పేర్కొన్నారు. అమరావతిలో అవినీతి జరిగితే దానిపై విచారణ జరిపించాలే తప్ప మార్చేస్తామంటే ప్రజలు అంగీకరించబోరని ఆయన చెప్పారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాతో సంప్రదించిన తర్వాతే రివర్స్‌టెండరింగ్, పీపీఏల సమీక్షపై నిర్ణయం తీసుకున్నట్టు విజయసాయి చెబుతున్నదానిలో వాస్తవం లేదని ఆయన చెప్పారు. రివర్స్ టెంటరింగ్‌కు కేంద్రం ఆమోదం వుంటే పోలవరంపై కేంద్రానికి ఎందుకు లేఖ రాశారని సుజన నిలదీశారు.