జాతీయ వార్తలు

ఉరీ ఆర్మీ బ్రిగేడియర్‌పై వేటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, అక్టోబర్ 1: జమ్మూకాశ్మీర్‌లోని ఉరీ సైనిక శిబిరం పాక్ ఉగ్రవాదుల దాడి, తదనంతర పరిణామాల నేపథ్యంలో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఆర్మీ బ్రిగేడియర్‌పై వేటు పడింది. సెప్టెంబర్ 18న పాక్ ముష్కరులు జరిపిన దాడిలో 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. పలువురు గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి ఉరీలోని బ్రిగేడియర్ కమాండర్ కె సోమశంకర్‌ను అక్కడి బదిలీ చేసినట్టు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. అత్యంత కీలకమైన ఉరీ సెక్టార్ నుంచి ఆయనను తొలగిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా ఉండగా ఈ వ్యవహారంపై స్పందించడానికి సైనిక అధికారులు సముఖత వ్యక్తం చేయలేదు.