జాతీయ వార్తలు

పేదరిక నిర్మూలనకు కట్టుబడి ఉన్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, అక్టోబర్ 17: పశ్చిమ బెంగాల్‌లో పేదరిక నిర్మూలనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ వినాయక్ పేదరికంపై రూపొందించిన సిద్ధాంతం దీర్ఘకాలంలో పేదరిక నిర్మూలనకు బాగా దోహదపడుతుందని ఆమె గురువారం సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఒక సందేశంలో పేర్కొన్నారు. మమతా బెనర్జీ బుధవారం సాయంత్రం అభిజిత్ వినాయక్ ఇంటికి వెళ్లి ఆయన తల్లి నిర్మలా బెనర్జీతో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని ఆమె గురువారం నాటి ట్విట్టర్ సందేశంలో తెలిపారు. తమ భేటీకి సంబంధించిన ఫొటోలను కూడా మమతా బెనర్జీ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అభిజిత్ వినాయక్ సాధించిన విజయాలకు బంగ్లా ఎంతో గర్విస్తోందని ఆమె పేర్కొన్నారు.