జాతీయ వార్తలు

వీరి కళ్లు మూసుకుపోయాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: బీజేపీ నేతలకు విద్వేషంతో కళ్ళు మూసుకుని పోయాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర స్వరంతో ధ్వజమెత్తారు. అర్థ శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన అభిజిత్ బెనర్జీ వామపక్ష భావాలు కలిగిన వ్యక్తి అంటూ కేంద్ర మంత్రి పియూష్ గోయల్ చేసిన విమర్శపై రాహుల్ మండిపడ్డారు. ఈ నేతలకు వృత్తిపరమైన నిబద్ధత అంటే ఏమిటో తెలియదని అభిజిత్ బెనర్జీ సాధించిన విజయం భారతీయులందరికీ గర్వకారణమని రాహుల్ అన్నారు. ఈ తరహాలో మాట్లాడే వారిని ఎవరూ మార్చలేరని ఓ దశాబ్దం పాటు ప్రయత్నించినా ఈ నేతల ధోరణి ఇలాగే ఉంటుందని రాహుల్ అన్నారు. పియూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ మండిపడిన సంగతి తెలిసిందే. మరోపక్క కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ సింఘ్వి కూడా బెనర్జీ చేసిన సేవలను శ్లాఘించారు. పియూష్ గోయల్ తరహా నేతలు చేసే వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఇలాంటి వారికి నోబెల్ బహుమతి రావడం అనేది కలలో కూడా ఊహించలేమని అన్నారు. వీరి మాటలను పట్టించుకోకుండా అభిజిత్ బెనర్జీ ముందుకు సాగాలని యావత్ భారతం ఆయనకు అండగా నిలుస్తుందని సింఘ్వి అన్నారు.

*చిత్రం... కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ