జాతీయ వార్తలు

కేరళ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, నవంబర్ 16: ఢిల్లీ నుండి త్రివేండ్రం వెళుతున్న కేరళ ఎక్స్‌ప్రెస్ శనివారం రాత్రి 8.20 గంటల ప్రాంతంలో చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలో రెండు బోగీలు పట్టాలు తప్పడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ఈ లైన్‌లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సుమారు ఏడు గంటల సమయంలో రైలు ఏర్పేడు వద్దకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ప్యాంట్రీకారు బోగీ పట్టాలు తప్పింది. దీని వెనుకనే ఉన్న రెండు బోగీలు వరుసగా పట్టాలు తప్పాయి. ప్రమాదం జరిగిన విషయాన్ని డ్రైవర్ గమనించి బ్రేక్ వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే కొంతమంది ప్రయాణికులు స్వల్ప గాయాలయ్యాయి. అయితే కుదుపు భయం నుంచి మిగతా ప్రయాణికులు తేరుకోలేదు. వారంతా ఇంకా భీతావహులై చీకట్లో కాలం గడుపుతున్నారు.