జాతీయ వార్తలు

జెడి యు అధ్యక్షుడిగా నితీశ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌గిర్, అక్టోబర్ 16: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ యునైటెడ్ జనతాదళ్ అధ్యక్షుడిగా అధికారికంగా ఎన్నికయ్యారు. జాతీయ రాజకీయాల్లో కాలక పాత్ర పోషించటానికి ఆయనకు మరింత అవకాశమిచ్చినట్లయింది. జెడియు జాతీయ మండలి పార్టీ అధ్యక్షుడిగా నితీశ్ కుమార్ పేరును ఆదివారం ఆమోదించింది. నలందా జిల్లాలో జరిగిన నేషనల్ కౌన్సిల్ సమావేశంలో నితీశ్ కుమార్ ఒక్కరి పేరే ప్రతిపాదించటంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. పార్టీ రాజ్యసభ సభ్యుడు హరివంశ్ నితీశ్‌కుమార్ పేరును ప్రతిపాదించగా, 23 రాష్ట్రాలనుంచి వచ్చిన ప్రతినిధులు ఆయన పేరును ఆమోదించారు. బిజేపీకి బలమైన ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో జెడియు నిలుస్తుందని పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి త్యాగి అన్నారు. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా మాత్రం నితీశ్‌కుమార్ పేరును పార్టీ ప్రకటించలేదు.