జాతీయ వార్తలు

జయను పరామర్శించిన తమిళనాడు గవర్నర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, అక్టోబర్ 22: గత కొద్ది రోజులుగా ఇక్కడి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను శనివారం ఆ రాష్ట్ర తాత్కాలిక గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు పరామర్శించారు. ఇంతకు ముందు జయలలిత ఆరోగ్యంపై రకరకాల పుకార్లు వస్తుండడంతో ఈ నెల 1న ఆయన అపోలో ఆస్పత్రిని సందర్శించి ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. నిపుణుల బృందం జయలలితకు ఇస్తున్న చికిత్స గురించి అపోలో హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి గవర్నర్‌కు వివరించారు. అన్ని ముఖ్యమైన అవయవాలకు సంబంధించి జయలలిత నిరంతరం నిపుణుల పర్యవేక్షణలోనే ఉన్నారని గవర్నర్‌కు చెప్పినట్లు తెలిపింది. ఇలా ఉండగా, శనివారం కేంద్రమంత్రి సుజనా చౌదరి, టిడిపి ఎంపీలు సిఎం రమేశ్, మురళీమోహన్‌లు జయను అపోలోలో పరామర్శించారు.