జాతీయ వార్తలు

కేంద్ర ఉద్యోగులకు దీపావళి కానుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 27: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మూడు రోజుల ముందే దీపావళి వచ్చింది. 2 శాతం డిఏ పెంచుతూ గురువారం జరిగిన కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 50 లక్షల మంది ఉద్యోగులు, 58 లక్షల మంది పెన్షనర్లు లబ్ధిపొందనున్నారు. పెంచిన డిఏ 2016 జూలై 1 నుంచి అమలు చేస్తారు. వినియోగ ధరల పెంపు సూచీకి అనుగుణంగా ప్రభుత్వం డిఏ నిర్ణయిస్తుంది. ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు 6 శాతం డిఏ పెంచింది. పెంచిన డిఏ బేసిక్ పేపై 125 శాతం. తరువాత పెరిగిన డిఏను ఏడో వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా బేసిక్ పేలో కలిపారు. అయతే తమకు 3 శాతం డిఏ పెంచాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయ.