జాతీయ వార్తలు

ఎల్‌ఓసి వద్ద కాల్పులు.. పాక్ రేంజర్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ, అక్టోబర్ 27: జమ్మూకాశ్మీర్ సరిహద్దులోని ఆర్‌ఎస్ పుర సెక్టార్‌లో బుధవారం రాత్రి జరిగిన కాల్పుల్లో పాకిస్తాన్ రేంజర్ మృతి చెందాడని బిఎస్‌ఎఫ్ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో ఒక బిఎస్‌ఎఫ్ జవాను మరణించినట్టు తెలిపాయి. ఆరుగురు పౌరులకు గాయాలయ్యాయి. ఆర్‌ఎస్ పుర సెక్టార్‌లోని ఆర్నియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అలాగే ఎల్‌ఓసి వద్ద సుందేర్‌బనీలో పాక్ దళాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి ఉల్లంఘించాయ. ఆర్‌ఎస్ పుర, ఆర్నియా సెక్టార్‌లో ఒక పాకిస్తాన్ రేంజన్ మృతిచెందగా, మరొకరు గాయపడ్డారని బిఎస్‌ఎఫ్ సీనియర్ అధికారి వెల్లడించారు. గాయపడ్డ వ్యక్తిని పాక్ దళాలు తమ వాహనంలో తీసుకెళ్లిపోయినట్టు వారు తెలిపారు. ఇరుదేశాల సైనికుల మధ్య భారీగా ఎదురుకాల్పులు జరిగాయన్నారు.

చిత్రం.. ఆర్‌ఎస్ పురా సెక్టార్‌లో పాక్ సైనికుల కాల్పుల్లో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్థానికులు