జాతీయ వార్తలు

ఎన్‌కౌంటర్‌లో మిలిటెంట్ హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, నవంబర్ 5: దక్షిణ కాశ్మీర్‌లోని సోపియన్ జిల్లాలో శనివారంనాటి ఎన్‌కౌంటర్‌లో ఓ మిలిటెంట్ మరణించాడు. ఒక సైనికుడు గాయపడ్డాడు. ఇక్కడకు 60 కిలోమీటర్ల దూరంలోని దొబ్జాన్ గ్రామంలో నలుగురు మిలిటెంట్లు సంచరిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. భద్రతాదళాలు, స్థానిక పోలీసులు ఆ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. మిలిటెంట్లు దాగిన ఇంటిని ముట్టడించారు. దీంతో మిలిటెంట్లు కాల్పులు మొదలెట్టారు. భద్రతా సిబ్బంది కూడా ఎదురుకాల్పులు జరపగా ఓ మిలిటెంట్ మృతి చెందాడు. మిలిటెంట్ల కాల్పుల్లో ఓ జవాను గాయపడ్డాడు.