జాతీయ వార్తలు

ఆదుర్దా వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 13: బ్యాంకుల వద్ద తగినంత నగదు ఉందని, అందువల్ల జనం ఆదుర్దా పడి పదే పదే బ్యాంకులకు, ఎటిఎంలకు వెళ్లాల్సిన పని లేదని రిజర్వ్ బ్యాంక్ ఆదివారం స్పష్టం చేసింది. ఆదివారం కూడా దేశవ్యాప్తంగా బ్యాంకు శాఖలు, ఎటిఎంల వద్ద జనం రద్దీ తగ్గలేదన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆర్‌బిఐ ఈ ప్రకటన చేసింది. ఆర్‌బిఐ దగ్గర, బ్యాంకుల దగ్గర వంద రూపాయలు, ఇతర చిల్లర నోట్లు చాలినన్ని ఉన్నాయని, జనం ఆదుర్దా చెంది పదే పదే బ్యాంకులకు, ఎటిఎంలకు రావలసిన పనిలేదని, ఎప్పుడు అవసరమైతే అప్పుడే నగదు తీసుకోవచ్చని ఆర్‌బిఐ ఒక ప్రకటనలో తెలిపింది.

చిత్రం.. వారణాసిలో ఒక బ్యాంక్ వద్ద ఆదివారం బారులుతీరిన జనం