జాతీయ వార్తలు

మందుపాతర పేల్చిన మావోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, నవంబర్ 21: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో సోమవారం మావోయిస్టులు మందుపాతర పేల్చిన ఘటనలో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సుక్మా ఎఎస్పీ జితేంద్ర శుక్లా కథనం ప్రకారం.. చింతలనార్ - నర్సాపురం గ్రామాల మధ్య రహదారి నిర్మాణానికి సిఆర్‌పిఎఫ్ 74వ బెటాలియన్‌కు చెందిన జవాన్లు పహరా కాస్తున్నారు. ఉదయం రోడ్డు నిర్మాణ పనుల వద్ద ఉండగా మావోయిస్టులు మందుపాతరను పేల్చారు. ఈ ఘటనలో హెడ్ కానిస్టేబుల్ పర్వీందర్, మరో జవాను సాగర్ గాయపడ్డారు. వీరిని హెలికాప్టర్‌లో జగదల్‌పూర్‌కు తరలించారు.