జాతీయ వార్తలు

ఆ 13వేల కోట్లు నావి కావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహమ్మదాబాద్, డిసెంబర్ 3: నల్లధనం స్వచ్ఛంద వెల్లడి పథకంలో రూ.13,860 కోట్లు వెల్లడించిన ప్రాపర్టీ డీలర్ మహేశ్ షా శనివారం నాటకీయ పరిణామాలలో లొంగిపోయారు. ఐటి అధికారులు మహేశ్ షా ఇంటిపై దాడులు చేయటంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీనిపై మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు రావటంతో ఓ గుజరాతీ చానల్ లైవ్ షోలో నేరుగా ప్రత్యక్షమై లొంగిపోయారు. సెప్టెంబర్ నెలాఖరుతో ముగిసిన ఐడిఎస్ పథకం కింద మొత్తం తన సంపద 65వేల కోట్ల రూపాయల సంపదలో లెక్కల్లోకి రాని మొత్తం కింద 13వేల 860 కోట్లను వెల్లడించారు. ఇందుకు సంబంధించి 45శాతం పన్ను చెల్లించాలని ఐటి విభాగం షాను ఆదేశించింది. ఇందులో తొలి వాయిదా కింద రూ.1560 కోట్లను చెల్లించాల్సి ఉండగా షా చెల్లించకపోవటంతో ఐటి అధికారులు ఆయన నివాస సముదాయాలపై దాడులు చేశారు. అయితే ఐడి ఎస్ కింద ప్రకటించిన ఆదాయం తనది కాదని దానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారులకు వెల్లడిస్తానని షా తెలిపారు. టివి స్టూడియో నుంచి ఐటి అధికారులు షాను తమ అదుపులోకి తీసుకుని వెళ్లిపోయారు.