జాతీయ వార్తలు
మూడు రోజులూ సభలోనే మోదీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, డిసెంబర్ 13: రానున్న మూడు రోజులపాటు ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్లోనే ఉంటారని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. తాము సానుకూలంగా వ్యవహరిస్తున్నప్పటికీ విపక్షాలే ఎప్పటికప్పుడు లక్ష్యాలు మార్చుకుంటూ ఉభయ సభల్లోనూ రాద్దాంతం సృష్టిస్తున్నాయని విరుచుకుపడ్డారు. ఢిల్లీలో లేకపోయినప్పుడు తప్ప ప్రధాని మోదీ రోజువారీగా పార్లమెంట్కు వస్తూనే ఉన్నారని అందరికంటే ముందు వచ్చి అందరికంటే చివర వెళుతున్నారని కూడా వెంకయ్య నాయుడు అన్నారు. పార్లమెంట్లోని తన గదిలోనే కూర్చుని ఉభయ సభల కార్యకలాపాలను పరిశీలిస్తారని, ఎప్పుడు అభ్యర్థన వస్తే అప్పుడు సభకు వస్తారని చెప్పారు. మరి రానున్న మూడు రోజులూ మోదీ పార్లమెంట్కు వస్తారా అన్న ప్రశ్నకు ‘వస్తారు..’ అని ఆయన సూటిగా జవాబిచ్చారు.