జాతీయ వార్తలు

ముడుపుల వ్యవహారంపై దర్యాప్తు చేయించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: పెద్దనోట్ల రద్దుకు ఆకస్మాత్తుగా కేంద్రం నిర్ణయం తీసుకోవడం వల్ల దేశంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొటున్నారని కాంగ్రెస్ నాయకుడు వి.హనుమంతురావు అన్నారు. మంగళవారం ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడుతూ ఒక్క శాతం ఉన్న నల్ల కుబేరులను పట్టుకోకుండా ప్రజలకు ఇబ్బందిపెట్టడం సరికాదన్నారు. నోట్లరద్దుతో నగదు లభించక రైతులు, కార్మిక వర్గాలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రధాని విదేశాల్లో ఉన్న నల్లధనం తీసుకురాలేక దేశంలో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తారా? అని ప్రశ్నించారు. మోదీకి చిత్తశుద్ధి ఉంటే సహారా ముడుపులు వ్యవహారంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ పిలుపు మేరకు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తానని వెల్లడించారు. తెలంగాణ శాసనసభలో అధికార పక్షం తీరు అణచివేత ధోరణిగా ఉందన్నారు.