జాతీయ వార్తలు

అమ్మా..దీవించు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 30: తమిళనాడులో అధికార అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శిగా నియమితురాలైన వి.కె.శశికళ శనివారం పదవీ బాధ్యతలను చేపట్టబోతున్నారు. ఇందుకు వీలుగా రోయపేటలోని అన్నాడిఎంకె ప్రధాన కార్యాలయం ముస్తాబవుతోంది. ముందుగా పార్టీ సంస్థాపకుడు ఎం.జి.ఆర్ విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం పార్టీ అధినేత్రిగా శశికళ బాధ్యతలు చేపట్టనున్నారని తెలుస్తోంది. శనివారం ఉదయం 11 గంటలకే పార్టీ సారథ్యాన్ని శశికళ చేపట్టవచ్చునంటూ అన్నాడిఎంకె ప్రతినిధి సి.ఆర్.సరస్వతి వెల్లడించారు.
కాగా, శుక్రవారం సాయంత్రం మెరీనా బీచ్‌కు వెళ్లిన శశికళ అక్కడవున్న ఎంజిఆర్. సిఎన్ అన్నాదురై, జయలలిత సమాధులను సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. చిన్నమ్మ వర్థిల్లాలి అంటూ పార్టీ కార్యకర్తల నినాదాల మధ్య ఆమె జయలలితకు శ్రద్ధాంజలి ఘటించారు. భావోద్వేగానికి లోనైన శశికళ తనను అన్నాడిఎంకె అధినేత్రిగా నియమిస్తూ చేపట్టిన తీర్మానాల కాపీలను జయ సమాధి వద్ద ఉంచారు. కొద్దిసేపు వౌనంగా ప్రార్థనలు చేసిన ఆమె జయ సమాధి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఎంజిఆర్ మెమోరియల్ వద్ద శశికళకు పార్టీ ప్రిసీడియం చైర్మన్ ఇ.మధుసూదనన్, రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తదితరులు స్వాగతం పలికారు.

చిత్రం..శుక్రవారం చెన్నైలోని మెరీనా బీచ్‌కు వెళ్లి జయ సమాధివద్ద సాష్టాంగపడ్డ శశికళ