జాతీయ వార్తలు

నలుగురు సహచరుల దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఔరంగాబాద్, జనవరి 12: బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో ఓ జవాను నలుగురు సహచరులను కాల్చిచంపిన ఘోర సంఘటన జరిగింది. నవీనగర్ విద్యుత్ ఉత్పాదక కంపెనీ ప్రాంగణంలోనే గురువారం ఓ సిఐఎస్‌ఎఫ్ జవాను ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. సెలవులకు సంబంధించి వీరి మధ్య వివాదం తలెత్తిందని, కోపంతో ఊగిపోయిన బల్బీర్ అనే జవాను తన సర్వీసు రివాల్వర్‌తో నలుగురిపై కాల్పులు జరిపాడని ఇద్దరు అక్కడికక్కడే మరణించారని ఎస్పీ సత్యప్రకాశ్ తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ మరో ఇద్దరు ఆసుపత్రికి తీసుకెళ్లే లోగానే మరణించారన్నారు.
మధ్యాహ్నం పనె్నడున్నరకు ఈ సంఘటన జరిగిందని, హంతకుడు బల్బీర్‌ను అరెస్టు చేశామని చెప్పారు. ఫిఫ్టులు మారుతున్న సమయంలో జవాన్లందరూ ఒకే చోటకు చేరుకున్న సమయంలోనే సంఘర్షణ తలెత్తిందని, దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు. మరో పక్క సిఐఎస్‌ఎఫ్ కూడా దీనిపై దర్యాప్తుకు ఆదేశించింది.