జాతీయ వార్తలు

ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జనవరి 16: జయలలిత మరణం వలన రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభాన్ని ఆసరాగా చేసుకుని ప్రత్యర్థులు లబ్ధి పొందకుండా చూడాలని ఇటీవల ఎఐఎడిఎంకె ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన వికె.శశికళ సోమవారం తమ శ్రేణులకు పిలుపు నిచ్చారు. కార్యకర్తల ప్రేమపూర్వక ఆదేశం మేరకే పార్టీ పగ్గాలను చేపట్టానని, అయినప్పటికీ జయలలిత మరణం వలన ఏర్పడిన వెలితిని ఎవరూ పూడ్చలేరని ఎఐఎడిఎంకె వ్యవస్థాపకులు ఎంజి.రామచంద్రన్ శత జయంతి సందర్భంగా ఇచ్చిన సందేశంలో ఆమె స్పష్టం చేశారు. ‘అమ్మ మరణానంతరం ఏర్పడిన వెలితిని ఎవరూ పూడ్చలేరు. అయినప్పటికీ క్షేత్రస్థాయిలోని కోట్లాది మంది పార్టీ కార్యకర్తలపై ఇప్పుడు చాలాపెద్ద బాధ్యత ఉంది. అమ్మ మరణం వలన ఏర్పడిన సంక్షోభాన్ని ఆసరాగా చేసుకుని ప్రత్యర్థులెవరూ లబ్ధి పొందకుండా చూడటమే మన ముందున్న అతిపెద్ద బాధ్యత’ అని శశికళ పేర్కొన్నారు.