జాతీయ వార్తలు

పంజాబ్, గోవాల్లో మాదే గెలుపు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 19: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, మరో మంత్రి సత్యేంద్ర జైన్ కుమార్తెపై కేంద్ర ప్రభుత్వం సిబిఐ దర్యాప్తుకు ఆదేశించడమే ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్, గోవా రాష్ట్రాల్లో విజయం సాధించబోతోందనడానికి సంకేతాలని ఆ పార్టీ గురువారం వ్యాఖ్యానించింది. ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం తథ్యమని ప్రధాని నరేంద్ర మోదీ భయపడుతున్నారని, సిబిఐ చర్య దానికి నిదర్శనమని ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ దిలీప్ పాండే గురువారం విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. ఏప్రిల్ 15కు ముందే పంజాబ్ మంత్రి బిక్రమ్ సింగ్ మఝితియాను జైల్లో పెడతానని ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించడం కూడా దీనికి కారణమై ఉండవచ్చని అన్నారు.