జాతీయ వార్తలు

పరిమితి 4లక్షలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 23: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కేంద్ర సాధారణ బడ్జెట్‌పై జనంలో ఆశలు మరింతగా పెరిగాయి. అర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఏకరమైన తాయిలాలు అందించనున్నారన్న దానిపై మధ్యతరగతి వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వీరితోపాటు ఇతర వర్గాల ఆకాంక్షలనూ ఈడేర్చే విధంగానే కొత్త 2017 బడ్జెట్ రూపుదిద్దుకునే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఆదాయం పన్ను మినహాయింపు పరిమితిని ప్రస్తుత రెండున్నర లక్షల నుంచి నాలుగు లక్షల వరకూ పెంచే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. దీని వల్ల ఉద్యోగ వర్గాలకు మరింత వెసులుబాటు కలుగుతుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సాధారణ, రైల్వే బడ్జెట్‌లను ఒకేసారి ప్రవేశ పెట్టడం..అలాగే నెల రోజుల ముందుగానే అంటే ఫిబ్రవరి ఒకటినే వీటిని పార్లమెంట్ ముందుంచాలని నిర్ణయించడం ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలో జైట్లీ బడ్జెట్‌పై అన్ని వర్గాల్లోనూ కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. అలాగే నగదు రహిత లావాదేవీలను మరింతగా ప్రోత్సహించేందుకూ, అలాగే డెబిట్, క్రెడిట్ కార్డు చెల్లింపులపై మరిన్ని డిస్కౌంట్లు కల్పించేందుకూ జైట్లీ పలు ప్రతిపాదనలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అందరికీ ఆవాస కల్పనే లక్ష్యంగా ప్రకటించిన మోదీ సర్కార్ ఈ దిశగా కూడా పలు రాయితీలను అందించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే కొత్త బడ్జెట్‌లో పన్ను లబ్ధిని చేకూర్చే అవకాశమూ ఉంటుందని చెబుతున్నారు. నోట్ల రద్దు కారణంగా దారుణంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకూ ఆర్ధిక మంత్రి కొంత వెసులుబాటు కల్పించవచ్చు.

చిత్రం..విత్తజవాబుదారీ తనం, బడ్జెట్ నిర్వహణపై ఓ నివేదికను సోమవారం ఆర్థిక మంత్రి
అరుణ్ జైట్లీకి అందిస్తున్న మాజీ రెవిన్యూ కార్యదర్శి ఎన్‌కె సింగ్