జాతీయ వార్తలు
ఎన్హెచ్చార్సీ డీజీని నియమించండి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 24 January 2017
న్యూఢిల్లీ, జనవరి 23: జాతీయ మానవ హక్కుల కమిషన్కు వారం రోజుల్లోగా డైరెక్టర్ జనరల్ను నియమించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె ఎస్ ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం స్పందిస్తూ డిజిని వారం రోజుల్లో నియమించాలని, కమిషన్ సభ్యులను నాలుగు వారాల్లోగా నియమించాలని స్పష్టం చేసింది. ‘మేము (సుప్రీం కోర్టు) ఈ వ్యవహారాన్ని విచారించటం ప్రారంభిస్తే మీరు (కేంద్రం) సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. సభ్యుల నియామక ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తారని ఆశిస్తున్నాం. డిజిగా ఒకరిని నియమించటానికి మీకొచ్చిన ఇబ్బంది ఏమిటి? మీరు కచ్చితంగా డిజిని నియమించాల్సిందే. ఈ విషయంలో ఎక్కువ సమయం ఇవ్వదలచుకోలేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.