జాతీయ వార్తలు

అలరించిన చిన్నారుల నృత్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థినుల నృత్యాలు గణతంత్ర పరేడ్‌లో అద్భుతంగా అలరించాయి. నాగపూర్ దక్షిణ సెంట్రల్ జోన్ సెంటర్, ఢిల్లీలోని సర్వోదయ కన్య విద్యాలయ, కేంద్రీయ విద్యాలయ, వౌంట్ అబు విద్యాలయలకు చెందిన విద్యార్థినుల బృందాలు అపూర్వమైన నృత్యప్రదర్శన చేశాయి. 165మంది విద్యార్థినులతో వచ్చిన నాగపూర్ బృందం సైలా నృత్యం చేశారు. ఢిల్లీలోని సర్వోదయ విద్యాలయకు చెందిన 150మంది విద్యార్థినులు దేశభక్తి గీతాల నృత్యాలతో అలరించారు. ఇక వౌంట్ అబు విద్యార్థినులు అస్సామీ నృత్య శైలిలో మానవ అస్తిత్వానికి తెలియజేసే నృత్యాన్ని ప్రదర్శించారు. కేంద్రీయ విద్యాలయకు చెందిన 162మంది విద్యార్థినులు జాతీయ పతాకం మన స్వాతంత్ర సమర యోధుల గాథలకు ఎలా ప్రతీకగా నిలుస్తుందో తెలుపుతూ నృత్య ప్రదర్శన చేశారు.