జాతీయ వార్తలు

సాహస బాలలకు శాల్యూట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ సంవత్సరం వివిధ సందర్భాల్లో సాహసాన్ని ప్రదర్శించిన బాల వీరులు గురువారం నాటి పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం 25మంది బాల వీరులకు జాతీయ సాహస బాలల అవార్డులను అందజేశారు. వరదల్లో కొడ్డుకుపోతున్న తన మిత్రులను కాపాడి అసువులు బాసిన తారా పీజుకు మరణానంతరం ‘్భరత్’ అవార్డు లభించగా మానవ అక్రమ రవాణాను అడ్డుకున్న తేజశే్వత ప్రధాన్, శివానీ గోండ్‌లకు గీతా చోప్రా అవార్డులు లభించాయి. సంజయ్ చోప్రా అవార్డును సుమిత్ మమ్‌గెన్‌కు లభించింది. భారత శిశు సంక్షేమ మండలి 1957 నుంచి జాతీయ సాహస బాలల అవార్డులను అందిస్తోంది. రిపబ్లిక్‌డే పరేడ్‌లో అందంగా అలంకరించిన వాహనాలపై సాహసబాలలు ప్రదర్శనగా వస్తున్నప్పుడు ప్రేక్షకులు పెద్దపెట్టున చప్పట్లు కొడుతూ అభినందనలు తెలిపారు.