జాతీయ వార్తలు

కరవుకు శాశ్వత పరిష్కారం కనుగొనాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: దేశం తీవ్రంగా ఎదుర్కొంటున్న కరవురక్కసిని ఎదుర్కోవటానికి రాష్ట్రాలు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి బుధవారం పిలుపునిచ్చారు. కరవు పరిస్థితులను ఎదుర్కోవటానికి అవసరమైన సాయాన్ని రాష్ట్రాలకు అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ఆమె అన్నారు. ఇంధన, పరిశోధనా సంస్థ(తెరి) ఏర్పాటు చేసిన ‘ ఇండియా వాటర్ ఫోరమ్’ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. కరవు పరిస్థితిని ఎదుర్కోవటానికి ముందస్తు చర్యలు రాష్ట్రాలు తీసుకోవలసి ఉందని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు.