జాతీయ వార్తలు

కీర్తి అజాద్ కేజ్రీవాల్‌కు సమన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 30: ఢిల్లీ క్రికెట్ సంఘం ప్రతిష్ఠను దిగజార్చే విధంగా వ్యాఖ్యలు చేసిన కేసులో రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్, బిజెపి ఎంపీ కీర్తి అజాద్‌కు మెట్రోపాలిటన్ కోర్టు సమన్లు పంపింది. నిరాధారమైన సమాచారం ఆధారంగా వీరిద్దరూ చేసిన వ్యాఖ్యల వల్ల ఈ సంస్థ, దాని అధికారులకు తీవ్రస్థాయిలో పరువునష్టం జరిగిందని కోర్టు పేర్కొంది. ఫిబ్రవరి 18న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. క్రికెట్ టీమ్‌లో తన కుమారుడ్ని ఎంపిక చేయాలంటే లైంగికంగా తన కోరిక తీర్చాలంటూ డిడిసిఎ అధికారి ఒకరు వత్తిడి తెచ్చినట్టుగా కేజ్రీవాల్, సస్పెండైన బిజెపి ఎంపీ కీర్తి అజాద్‌లు వ్యాఖ్యానించారని కోర్టు పేర్కొంది. వందలాది మంది పిల్లలకు శిక్షణ ఇచ్చే డిడిసిఎపై ఎలాంటి ఆధారం లేకుండా ఓ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలాంటి ఆరోపణలు చేయడం ఈ సంస్థ పనితీరుపై క్రికెటర్లందరిలోనూ తీవ్రస్థాయిలో అనుమానాలు తలెత్తే ప్రమాదం ఉంటుందని కోర్టు పేర్కొంది.