జాతీయ వార్తలు

పంజాబ్ ఎన్నికల ర్యాలీలో పేలుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భటిండా, జనవరి 31: పంజాబ్‌లో మంగళవారం సాయంత్రం ఓ ఎన్నికల ర్యాలీలో జరిగిన కారు బాంబు విస్ఫోటనంలో ముగ్గురు దుర్మరణం చెందారు. వౌర్ మండీ సమీపంలో ఉంచిన ఓ కారులో ఈ పేలుడు సంభవించిందని భటిండా డిప్యూటీ కమిషనర్ ఘన్‌శ్యామ్ ఓరి తెలిపారు. మరణించిన ముగ్గురిలో ఇద్దరు వృద్ధులు, ఓ బాలుడు ఉన్నారని పేర్కొన్నారు. ఈ సంఘటనలో పదిహేనుమంది గాయపడ్డారని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి నిర్వహిస్తున్న ఎన్నికల ర్యాలీ సమీపంలోనే ఈ శక్తిమంతమైన పేలుడు జరిగిందని తెలిపారు. గాయపడిన వారందరినీ ఆసుపత్రికి తరలించారు.