జాతీయ వార్తలు

మావోల ఘాతుకం.. ఇద్దరి హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, ఫిబ్రవరి 3: తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో మావోయిస్టులు కిరాతకానికి పాల్పడ్డారు.
తమను ఎదిరించినందుకు వేర్వేరు ఘటనల్లో శుక్రవారం ఇద్దరిని హత్య చేశారు. ఒడిశాలో జరుగుతున్న పంచాయితీ ఎన్నిలకను బహిష్కరించాలంటూ మావోయిస్టుల ఇచ్చిన పిలుపును ఖాతరు చేయకుండా పోటీకి దిగిన దర్సు దుర్వా అనే గిరిజనుడిని మొండెం నుంచి తలను వేరు చేసి కిరాతకంగా హత్య చేశారు. దర్వా డివిజన్ మావోయిస్టు కమిటీ పేరిట లేఖను విడుదల చేసిన మావోయిస్టులు బహిష్కరణ పిలుపును ఖాతరు చేయకపోతే ఇలాగే ఉంటుందని హెచ్చరించారు.
మరో వైపు కొద్ది కాలం కిందట తమ గ్రామాల్లోకి మావోయిస్టులు రావొద్దంటూ ఎదురుతిరిగిన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా కొవ్వాసికొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బుదింకొర్కా గ్రామస్థులను చితకబాదారు. వారిలో మండావి అనే గిరిజనుడిని తుపాకీతో కాల్చి చంపారు. ఈ ఘటనతో సరిహద్దుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.