జాతీయ వార్తలు

కాశ్మీర్ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మిలిటెంట్లు హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, ఫిబ్రవరి 4: ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో శనివారం భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మిలిటెంట్లు మృతి చెందగా ఇద్దరు పోలీసు అధికారులు గాయపడ్డారు.
బారాముల్లా జిల్లా అమర్‌ఘర్ ప్రాంతంలో మిలిటెంట్లు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో భద్రతా దళాలు శనివారం ఉదయం ఆపరేషన్ ప్రారంభించారు. మిలిటెంట్లు దాగి ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టిన భద్రతా దళాలు గాలింపు జరుపుతుండగా, మిలిటెంట్లు వారిపై కాల్పులకు తెగబడ్డంతో ఇరుపక్షాల మధ్య కాల్పులు మొదలయ్యాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మిలిటెంట్లు హతమయ్యారు. అయితే చనిపోయిన ఇద్దరు మిలిటెంట్లు ఏ గ్రూపును చెందినవారో, వారి వివరాలేమిటో ఇంకా ధ్రువీకరించలేదని పోలీసు అధికారి ఒకరు చెప్పారు. ఈ సంఘటనలో ఒక పోలీసు సబ్‌ఇన్‌స్పెక్టర్, మరో అధికారి గాయపడినట్లు కూడా ఆయన చెప్పారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంనుంచి ఒక ఎకెరైఫిల్, ఒక పిస్టల్, మరికొన్ని ఆయుధాలు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు ఆ అధికారి చెప్పారు.

చిత్రం..కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ జరిగిన స్థలంలో అప్రమత్తంగా ఉన్న సైనిక కమెండోలు