జాతీయ వార్తలు

సికిందరాబాద్-తిరుపతి మధ్య రెండు ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 7: ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సికిందరాబాద్-తిరుపతి మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఎం ఉమామహేశ్‌కుమార్ తెలిపారు. ట్రైన్ నెం. 02734 ఈనెల 10న సికిందరాబాద్ నుండి రాత్రి 7.15కు బయలుదేరి, మరుసటి రోజున ఉదయం గంటలకు తిరుపతి చేరుకుంటుందన్నారు. అదేవిధంగా తిరుగు ప్రయాణంలో ఈనెల 12న ట్రైన్ నెం. 02733 తిరుపతి నుంచి సాయంత్రం 5గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 05:50లకు సికిందరాబాద్ చేరుకుంటుందని, ఈ ప్రత్యేక రైలు కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుందని ప్రజాసంబంధాల అధికారి ఉమామహేశ్‌కుమార్ వివరించారు.