జాతీయ వార్తలు

నేడు పలు రైళ్లు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 9: అరక్కోణం-రేణిగుంట సెక్షన్ల మధ్య బ్రిడ్జి పనులు కొనసాగుతుండడంతో ఈ నెల 10,11 తేదీల్లో పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి తెలిపారు. ట్రైన్ నెం. 56011 అరక్కోణం-కడప ప్యాసింజర్, ట్రైన్ నెం. 56012 కడప-అరక్కోణం ప్యాసింజర్ రైళ్లు రద్దు చేసినట్టు పేర్కొన్నారు. అదేవిధంగా ట్రైన్ నెం. 66047 చెన్నై-తిరుపతి మెము అరక్కోణం-తిరుపతి స్టేషన్ల మధ్య, ట్రైన్ నెం. 66048 తిరుపతి-చెన్నై మెము తిరుపతి-అరక్కోణం మధ్య స్టేషన్లు, ట్రైన్ నెం. 66021 చెన్నై-తిరుపతి మెము అరక్కోణం-తిరుపతి మధ్య ఈనెల 12,13 తేదీల్లో పాక్షికంగా రద్దు చేశారు. ట్రైన్ నెం. 66022 తిరుపతి-చెన్నై మెము తిరుపతి-అరక్కోణం మధ్య స్టేషన్లకు ఈనెల 12,13 తేదీల్లో రద్దు చేసినట్టు తెలిపారు.