జాతీయ వార్తలు

జయ సమాధి సాక్షిగా శశి శపథం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఫిబ్రవరి 15: కోర్టుకు లొంగిపోయేందుకు బెంగళూరు వెళ్లే ముందు అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ మాజీ ముఖ్యమంత్రి జయలలిత సమాధి, పార్టీ వ్యవస్థాపకుడు రామాపురంలోని ఎంజి రామచంద్రన్ ఇంటిని సందర్శించిన సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముందుగా మెరీనా బీచ్‌లోని జయలలిత సమాధి వద్దకు వెళ్లిన శశికళ సమాధిపై మూడు సార్లు గట్టిగా కొట్టి మనసులో ఏదో స్మరించుకున్నట్లుగా కనిపించింది. జయలలిత సమాధిపై ఇంతగట్టిగా శశికళ కొట్టడాన్ని చూసి అక్కడ ఉన్న వారంతా విస్తుపోయారు. ఆమె మనసులో ఏమనుకుని ఉంటుందనే దానిపై భిన్న కథనాలు వెలువడుతున్నాయి. కచ్చితంగా ఇది అమ్మసాక్షిగా చిన్నమ్మ చేసిన శపథంగా పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు. జయ సమాధిని సందర్శించిన అనంతరం రామాపురంలోని ఎంజి రామచంద్రన్ నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించిన శశికళ చిత్రపటం ముందు కొద్దిసేపు వౌనంగా ధ్యానం చేశారు. ఇంటి ఆవరణలోనే ఉన్న, తాను ఇటీవల ఆవిష్కరించిన ఎంజిఆర్ నిలువెత్తు కాంస్య విగ్రహానికి సైతం శశికళ నివాళి అర్పించారు. ఎంజిఆర్ నివాసం వద్ద కొంతమంది మహిళలు శశికళకు హారతి పట్టారు.

చిత్రం..మెరీనా బీచ్‌లోని జయలలిత సమాధిపై మూడు సార్లు గట్టిగా కొట్టి శపథం చేస్తున్న శశికళ