జాతీయ వార్తలు

ఒకే నాణేనికి బొమ్మ, బొరుసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాన్పూర్, ఫిబ్రవరి 16: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఒకే నాణేనికి బొమ్మ, బొరుసు వంటివారని ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. గుజరాత్ సిఎంగా ఉన్నప్పుడు మోదీ, యుపిలో అఖిలేశ్ అల్లర్లను అడ్డుకోవడంలో విఫలమయ్యారని ఆయన ధ్వజమెత్తారు.
జిల్లాలోని ఎంఐఎం పోటీచేస్తున్న ఏకైక నియోజకవర్గం ఆర్యనగర్ పరిధిలోని కొలొనెల్‌గంజ్ ప్రాంతంలో బుధవారం రాత్రి ఒక ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ మోదీ సిఎంగా ఉన్న సమయంలో గుజరాత్‌లో అల్లర్లు జరిగాయని పేర్కొంటూ ఆ అల్లర్లను ఆపడంలో, ముస్లింలకు న్యాయం చేయడంలో మోదీ విఫలమయ్యారని విమర్శించారు. ముజఫర్‌నగర్ అల్లర్లను ఆపడంలో, బాధితులకు న్యాయం చేయడంలో సిఎంగా అఖిలేశ్ విఫలమయ్యారని అన్నారు. ఎస్‌పి, బిఎస్‌పిలు ముస్లింలను మోసగించడానికి ప్రయత్నిస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. బిజెపి బూచి చూపి ముస్లింలను భయపెట్టడంద్వారా వారి ఓట్లను కొల్లగొట్టడానికి అఖిలేశ్ ప్రయత్నిస్తున్నారని అసదుద్దీన్ ఆరోపించారు. ముస్లింలు ఎంఐఎం అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.