జాతీయ వార్తలు

ముంబయ కార్పొరేషన్‌లో పోలింగ్ ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 21: దేశ ఆర్థిక రాజధాని ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పలువురు సెలబ్రిటీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 227 డివిజన్ల బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బిఎంసి)కు మంగళవారం పోలింగ్ జరిగింది. అనేకమంది ప్రముఖులు ఓటు వేయడానికి ఉదయమే పోలింగ్ స్టేషన్లకు వచ్చారు. బాలీవుడ్ నటీనటులు రేఖ, పరేష్ రావల్, సోనమ్ కపూర్, అనుష్క శర్మ, వరుణ్ దావన్, శ్రద్ధా కపూర్, జాన్ అబ్రహాం, వివేక్ ఒబెరాయ్, డెరెక్టర్ జొయ అక్తర్, ప్రముఖ సినీ గేయరచయిత గుల్జార్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎవరు గెలిచినా వౌలిక సదుపాయల కల్పన, పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని డైరెక్టర్ జొయ అక్తర్ ఆకాంక్షించారు. ‘రహదారుల వెంట వెళ్లడం కష్టంగా ఉంటోంది. ప్రజలుకూడా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలి. మనం చెట్లను కొట్టవద్దు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత. దాన్ని ఎవరూ విస్మరించవద్దు’ అని అన్నారు. ప్రజలందరూ పెద్దఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారని, ముఖ్యంగా యువత ఉత్సహాంగా తరలివచ్చారని గుల్జార్ పేర్కొన్నారు. కాగా ఆయా రంగాల్లో బిజీగా ఉన్న పలువురు సెలబ్రిటీలు ఓటింగ్‌కు దూరంగానే ఉన్నారు.

చిత్రాలు....మంగళవారం జరిగిన ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటేసిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి
దేవేంద్ర ఫడ్నవిస్, ఆయన కుటుంబ సభ్యులు.
*భార్యతో కలిసి ఓటేసిన ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్