జాతీయ వార్తలు

అమిత్‌షాను మించిన కసబ్ ఎవరున్నారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంబేద్కర్‌నగర్ (యుపి), ఫిబ్రవరి 18: దేశంలో బిజెపి అధ్యక్షుడు అమిత్‌షాను మించిన ‘కసబ్’లు లేరని బిఎస్పీ అధినేత్రి మాయావతి తీవ్రంగా విమర్శించారు. అంబేద్కర్‌నగర్‌లో గురువారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడుతూ అమిత్‌షాపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలను కలిపి ‘కసబ్’ అంటూ ఉగ్రవాదితో అమిత్‌షా పోల్చటాన్ని ఆమె తప్పుపట్టారు. ‘ఇవాళ దేశంలో అమిత్ షా కంటే పెద్ద కసబ్‌లు మరొకరు లేరు’ అని ఆమె అన్నారు. అమిత్ షా వ్యాఖ్యలు బిజెపి వాళ్ల మనోవైకల్యానికి దర్పణాలని అన్నారు. 26/11 ముంబై దాడుల్లో ప్రధాన సూత్రధారి పాకిస్తాన్ ఉగ్రవాది కసబ్ అన్న విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్ క-స-బ (కాంగ్రెస్, సమాజ్‌వాది, బహుజన్ సమాజ్ పార్టీల నుంచి విముక్తి పొందనంత వరకు అభివృద్ధి జరగదని అమిత్ షా ఓ ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన సంగతి తెలిసిందే.