జాతీయ వార్తలు

ముంబయి మేయర్ పీఠం మాదే: శివసేన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 25: బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్‌కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని విషయం తెలిసిందే. అయినప్పటికీ మేయర్ పదవి తమ పార్టీకే దక్కుతుందని అతి పెద్ద పార్టీగా అవతరించిన శివసేన ధీమా వ్యక్తం చేసింది. మద్దతుకోసం తాము కాంగ్రెస్ పార్టీని సంప్రదిస్తున్నట్లు వచ్చిన వార్తలను ఆ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ తోసిపుచ్చారు. ‘అధిక సంఖ్యలో కార్పొరేట్లు మాకే ఉన్నారు. అందువల్ల మేయర్‌గా శివసేనకు చెందిన వారే ఉంటారు. మేము కాంగ్రెస్ మద్దతు కోరుతున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదు’ అని రౌత్ శనివారం ఇక్కడ పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. మీకు స్పష్టమైన మెజారిటీకి అవసరమైన 114 మందికన్నా తక్కువ బలం ఉంది కదా, మీ పార్టీ అభ్యర్థి మేయర్‌గా ఎలా ఎన్నికవుతారని ప్రశ్నించగా, వచ్చేనెల 9(మేయర్ ఎన్నిక తేదీ) దాకా వేచి చూడండి’ అని రౌత్ చెప్పారు. కాగా, ఉద్ధవ్ థాకరే మీడియాతో మాట్లాడలేదు.