జాతీయ వార్తలు

ఏ పనీ చేయకపోవడమే మోదీజీ పెద్ద తప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బలియా, మార్చి 2:ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ చేసినవన్నీ తప్పులేనంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ అదే రీతిలో సమాధానమిస్తూ, ఏ పనీ చేయకపోవడమే ప్రధాని చేసిన అతి పెద్ద తప్పని అన్నారు.‘ మోదీజీ మా తప్పుల గురించి మాట్లాడుతున్నారు. అభివృద్ధిపై చర్చించడానికి ఆయన భయపడుతున్నారు. ఏ పనీ చేయకపోవడమే ఆయన చేసిన అతి పెద్ద తప్పు’ అని అఖిలేశ్ గురువారం ఇక్కడ ఓ ఎన్నికల సభలో మాట్లాడుతూ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో విద్యుత్ సరఫరాలో వివక్ష పాటిస్తున్నారంటూ మోదీ చేసిన ఆరోపణను ప్రస్తావిస్తూ ‘మోదీ ఈ అంశంపై గంగానదిపై ప్రమాణం చేయలేదంటే ఆయన అన్న దానికి ఎలాంటి ఆధారాలు లేవనే అర్థం’ అని అఖివేశ్ అన్నారు. మా అయిదేళ్ల ప్రభుత్వం పనీతీరుపై రిపోర్టు ఇవ్వాలని ప్రధాని కోరుతున్నారని, అయితే మీ మూడేళ్ల పాలనలో ఏం చేశారో ముందు చెప్పండని ప్రధానిని ఉద్దేశించి ముఖ్యమంత్రి అన్నారు. సమాజ్‌వాది పార్టీకి మద్దతుగా ఓట్లేయాలని ఓటర్లను కోరిన అఖిలేశ్ ‘మీరు ఇప్పటికీ మీ సొమ్మును బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం కోసం క్యూలలో నిలుచున్నారు. ఇప్పుడు క్యూలో నిలబడి బిజెపికి వ్యతిరేకంగా ఓటేయాల్సిన సమయం వచ్చింది. మోదీ ‘మన్‌కీ బాత్’ను మనం చాలా కాలంగా వింటున్నాం’ అని అన్నారు.