జాతీయ వార్తలు

దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్న మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 2: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పచ్చి అబద్ధాలు చెప్తూ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క హామీ కూడా పూర్తిగా నెరవేర్చలేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా పేర్కొన్నారు. రైతులు, మాజీ సైనికులు, పేదలు ఇలా ఏ ఒక్క వర్గానికీ మోదీ వల్ల మేలు జరగలేదని ఆయన గురువారం వ్యాఖ్యానించారు. ‘‘నిజమేమిటంటే మోదీ ఎన్నడూ నిజం మాట్లాడరు’’ అని వ్యంగ్యంగా అన్నారు. మణిపూర్‌లో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడిన వీడియో క్లిప్‌ను ఆయన ప్రదర్శించారు. ఆ ప్రసంగంలో రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలను మోదీ తన యూపి ప్రసంగంలో తప్పుదోవ పట్టించారని సుర్జేవాలా ఆరోపించారు. మణిపూర్‌లో తయారైన కొబ్బరి జ్యూస్‌ని లండన్‌లో అమ్మాలని రాహుల్ కోరుకుంటున్నారంటూ వ్యంగ్యంగా మోదీ వ్యాఖ్యానించటాన్ని సుర్జేవాలా తప్పుపట్టారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతను ఇలా అవమానించినందుకు మోదీ క్షమాపణ చెప్పాలన్నారు.