జాతీయ వార్తలు

ఇక నుంచి జిహాదీ దాడుల్లో దావూద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 3: పాకిస్తాన్‌లో తలదాచుకుంటున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం భారత్‌పై తాము జరిపే జిహాదీ దాడిలో చేతులు కలుపుతాడని కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ వెల్లడించింది. జమాత్ ఉద దవాతో కలిసి దావూద్ కంపెనీ జిహాదీ కార్యక్రమాలు నడుపుతోందని జైషే చీఫ్ హాఫీజ్ సరుూద్ కొడుకు తల్హా చెప్పాడు. హఫీజ్ ప్రస్తుతం గృహ నిర్బంధంలో ఉన్నందున అతడి కొడుకు తల్హా సంస్థ బాధ్యతలు చూస్తున్నాడు. తాజాగా అతడి ప్రసంగం వీడియో సంచలనం రేపుతోంది. కాశ్మీర్ దినోత్సవం సందర్భంగా గత నెలలో తల్హా చేసిన ప్రసంగంలో అనేక దిగ్భ్రాంకరమైన అంశాలున్నాయి. ఫిబ్రవరి 5న తీసిన వీడియోలో భారత్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. సభకు హాజరైన జనంతో దావూద్‌ను కీర్తిస్తూ నినాదాలు చేయించాడు. మీరంతా వైద్యులు, పోలీసులు,న్యాయమూర్తులు అవుతారా?అని జనాన్ని ప్రశ్నించగా ‘లేదు’అని సమాధానం చెప్పారు. దావూద్ లేదా బుర్హాన్ వనీలు అవుతారా?అని అడగ్గా జనం ‘అవును’అని బదులిచ్చారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ ఉగ్రవాద సంస్థ దావూద్‌తో సంబంధాలు బయటపెట్టడం ఇదే మొదటిసారని ఇంటిలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. కాశ్మీర్ సహా పలు చోట్ల దాడులకు దావూద్ కుట్ర పన్నినట్టు తల్హా సంకేతాలు ఇచ్చాడని రక్షణశాఖ నిపుణులు ఓ వార్తా సంస్థను ఉటంకిస్తూ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదంతో దావూద్‌కు సంబంధాలున్నాయని చెప్పడానికి తిరుగులేని సాక్షం ఈ వీడియో అని ఫ్లయింగ్ ఆఫీసర్ శివాలీ దేశ్‌పాండే చెప్పారు.
భారత్‌లో జరిగిన అనేక ఉగ్రవాద దాడుల వెనక దావూద్ ఉన్నాడని భద్రతా విశే్లషకుడు బ్రిగేడియర్ ఎస్‌కె చటర్జీ స్పష్టం చేశారు.