జాతీయ వార్తలు

ఆ ఆస్తులు ఇక ప్రభుత్వానివే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 14: భారత విభజన సమయంలో తమ ఆస్తిపాస్తులను మన దేశంలోనే వదిలేసి పాకిస్తాన్, చైనాలకు వలస వెళ్లినవారికి ఇక్కడి అస్తులపై ఎలాంటి హక్కు ఉండదు. ఇందుకు సంబంధించి 49 ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న శత్రువుల ఆస్తి సవరణ బిల్లు (ఎనిమీ ప్రాపర్టీ బిల్)-2017ను లోక్‌సభ మంగళవారం మూజువాణి ఓటుతో ఆమోదించింది. గత వారం ఈ బిల్లుకు రాజ్యసభ ప్రతిపాదించిన సవరణలను లోక్‌సభ ఆమోదం తెలిపింది. 1968నాటి ఈ చట్టానికి ఇంతకాలం తరువాత సవరణలు చేశారు. ఎనిమీ ప్రాపర్టీ అంటే, శత్రువుకు సంబంధించిన, శత్రువు పక్షాన సంపాదించిన, శత్రు సంస్థకు చెందిన ఆస్తి అని బిల్లులో నిర్వచనం చెప్పారు. ఈ ఆస్తులన్నీ ఇకపై కేంద్ర ప్రభుత్వానికి చెందుతాయి. 1965లో భారత్ పాకిస్తాన్ యుద్ధం తరువాత 1968లో ఈ చట్టాన్ని చేశారు. ఇప్పుడు వీటికి కస్టోడియన్ అధికారాలను ప్రభుత్వానికి కట్టబెడుతూ సవరణలు చేశారు. ‘ఈ బిల్లు ప్రధానోద్దేశం 1968నాటి చట్టానికి మరింత స్పష్టత ఇవ్వటం. సుదీర్ఘంగా పెండింగ్‌లో ఉన్న ఒక సమస్యకు పరిష్కారం చూపటం’ అని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో విస్తారంగా ఉన్న రాజా మొహమ్మద్ అమిర్ మొహమ్మద్ ఖాన్ ఆస్తులకు సంబంధించిన కేసు సుప్రీం కోర్టు విచారణ ఉన్న నేపథ్యంలో ఈ బిల్లులో సవరణలు తప్పనిసరి అయింది. 2010లోనే ఈ సవరణలతో బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినప్పటికీ ఆమోదం పొందలేదు. మోదీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ అంశంపై అయిదుసార్లు ఆర్డినెన్స్‌లు జారీ చేశారు. అయిదో ఆర్డినెన్స్ గడువు మంగళవారంతో పూర్తవుతున్న నేపథ్యంలో రాజ్‌నాథ్‌సింగ్ లోక్‌సభ ఆమోదాన్ని పొందారు. ‘కొంతమంది ఎంపీలు ఈ విధంగా ఆస్తుల స్వాధీనం చేసుకోవటం సహజ న్యాయానికి విరుద్ధమని అంటున్నారు. ఏ విధంగా ఇది సహజన్యాయం కాదో నాకర్థం కావటం లేదు. పాకిస్తాన్ భారతీయ పౌరుల ఆస్తులన్నింటినీ జప్తు చేసింది. అలాంటప్పుడు మనం చేసేది కూడా సహజ న్యాయమే’ అని స్పష్టం చేశారు. ఈ చట్టం పూర్తి కావాలంటే, రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు సంబంధించిన చట్టాలు చేసుకోవలసి ఉంటుందని, ఇందుకు పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కాదనే భావిస్తున్నానని రాజ్‌నాథ్ అన్నారు.