జాతీయ వార్తలు

నేడు బిజెపిలో చేరనున్న ఎస్‌ఎం కృష్ణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మార్చి 21: కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం కృష్ణ బుధవారం బిజెపి తీర్థం పుచ్చుకోనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆయన పార్టీలో చేరతారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేసిన కృష్ణ ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. వాస్తవానికి ఆయన ఈ నెల 15నే బిజెపిలో చేరాల్సి ఉంది. అయితే సోదరి మృతి చెందడంతో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. కృష్ణ (84) జనవరి 29న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 1999-2004 మధ్యకాలంలో ఆయన కర్నాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. తరువాత కేంద్ర కేబినెట్‌లో విదేశాంగ మంత్రిగా పనిచేశారు. కొంతకాలం మహారాష్ట్ర గవర్నర్‌గా సేవలందించారు. బుధవారం ఢిల్లీలో బిజెపిలో చేరతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.