జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో ఉగ్రదాడి.. ఇద్దరు మిలిటెంట్ల హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, మార్చి 26: దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో పోలీస్ కాన్వాయ్‌పై దాడికి ప్రయత్నించిన ఇద్దరు హిజ్బుల్ ముజాహిద్దీన్ మిలిటెంట్లు హతమయ్యారు. ముగ్గురు పోలీస్ సూపరింటెండెంట్ స్థాయి అధికారులతో కూడిన ఈ బృందంపై మిలిటెంట్లు ఆకస్మికంగా కాల్పులు మొదలుపెట్టారని, తాము ప్రతిఘటించి ఇద్దర్ని అంతం చేశామని అధికారులు తెలిపారు. ఈ కాన్వాయ్‌లోని చివరి వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని మిలిటెంట్లు కాల్పులు జరిపారని వెల్లడించారు. వెంటనే అప్రమత్తమై మిగతావారి సాయంతో ఎదురుకాల్పులు జరిపామని, ఇద్దరిని అంతం చేశామని ఖోలీ అనే సీనియర్ అధికారి తెలిపారు. ఇద్దరు మిలిటెంట్లు ఒక కారులో వచ్చారని ఎన్‌కౌంటర్ తరువాత కారు డ్రైవర్ మాత్రం పరారయ్యాడని వెల్లడించారు. అతడి కోసం విస్తృతంగా గాలింపు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.