జాతీయ వార్తలు

గోవులను చంపేవాళ్ల కాళ్లు, చేతులు తీసేస్తా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముజఫర్‌నగర్, మార్చి 26: ఎవరైనా గోవులను చంపినా, అవమానించినా వారి కాళ్లు చేతులు విరిచేస్తానని ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ బిజెపి ఎమ్మెల్యే బెదిరించడం ద్వారా సరికొత్త వివాదానికి తెరదీశారు. ఖతౌలి ఎమ్మెల్యే విక్రమ్ సైని 2013లో జరిగిన ముజఫర్‌నగర్ అల్లర్ల కేసులో నిందితుడే కాకుండా జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు కూడా అయ్యారు. శనివారం యుపి మంత్రి సురేశ్ రాణాను సన్మానించేందుకు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో సైని ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘వందేమాతరం’ అనడానికి ఇష్టపడనివారు, ‘్భరత మాతాకీ జై’ అనడానికి బాధపడేవారు, గోవును తల్లిగా భావించక చంపేవారి కాళ్లు చేతులు విరిచేస్తానని హామీ ఇస్తున్నాను. ఈ హామీని నెరవేర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాంటి వారిపై చర్య తీసుకోవడానికి యువ కార్యకర్తల బృందం మాకుంది’ అని ఆయన అన్నారు. గోవుల స్మగ్లింగ్ నిషేధాన్ని కచ్చితంగా అమలు చేయాలని, అక్రమ కబేళాలపై చర్యలు తీసుకోవాలని యుపి కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించిన సమయంలో సైనీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.