జాతీయ వార్తలు

లంక చెరలో 12 మంది భారతీయ జాలర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, మార్చి 26: తమ సముద్రజలాల పరిధిలోకి వచ్చారన్న కారణంగా 12మంది భారతీయ జాలర్లను శ్రీలంక నౌకాదళం ఆదివారం అదుపులోకి తీసుకుంది. పుదుక్కోటై వద్ద ఆరుగురు, నాగపట్టినం తీర సమీపంలో మరో ఆరుగురు జాలర్లను వారితోపాటు రెండు ట్రాలర్ బోట్లను శ్రీలంక నౌకాదళం అదుపులోకి తీసుకుంది.
ఇటీవలే పదహారుమంది భారతీయ జాలర్లను శ్రీలంక సైన్యం అరెస్టు చేసింది. మన్నార్ జిల్లా అనలతీవు ద్వీపంలో ఈ ఘటన జరిగింది.