జాతీయ వార్తలు
చైత్ర నవరాత్రి సందర్భంగా.. మైహర్ స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైళ్ల హాల్ట్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 28 March 2017
హైదరాబాద్, మార్చి 27: ఈనెల 29 నుంచి ఏప్రిల్ 11వ తేదీ వరకు మైహర్లో జరిగే నవరాత్రి మహోత్సవాలకు యాత్రికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను మైహర్లో తాత్కాలికంగా నిలుపుతుందని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఉమాశంకర్ కుమార్ తెలిపారు. సికిందరాబాద్-దనపూర్, దనపూర్-సికిందరాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, చెన్నై సెంట్రల్-్ఛప్ర గంగా, కావేరి ఎక్స్ప్రెస్లు మైహర్లో ఆగుతాయని పేర్కొన్నారు. అదేవిధంగా ధన్బాద్-కొల్లాపూర్ దీక్షపూర్ ఎక్స్ప్రెస్, మైసూర్-్ధర్బంగా భాగమతి ఎక్స్ప్రెస్, పూర్ణ-పాట్నా ఎక్స్ప్రెస్, పాట్నా-పూర్ణ ఎక్స్ప్రెస్ రైళ్లు మైహర్లో కాస్సేపు ఆగుతాయని ఉమాశంకర్ కుమార్ తెలిపారు.