జాతీయ వార్తలు

రాజ్‌నాథ్, విపక్ష నేతలతో నేడు జగన్ బృందం భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: వైకాపా అధ్యక్షుడు జగన్ నేతృత్వంలోని వైకాపా నాయకుల బృందం కేంద్ర పభుత్వ పెద్దలను, వివిధ పార్టీల నేతలను కలవనుంది. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, జేడియూ నేత శరద్ యాదవ్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లతో మంగళవారం భేటీ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వైకాపా ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటున్న తీరును జగన్ వీరికి వివరించనున్నారు. కాగా ‘సేవ్ డెమోక్రసీ’ (ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి) పేరుతో జగన్ ఆధ్యర్యంలో వైకాపా నాయకుల బృందం సోమవారం ఢిల్లీకి చేరుకుంది. ఫిరాయింపుల చట్టాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ విధంగా అపహాస్యం చేస్తున్నారో కేంద్ర ప్రభుత్వ పెద్దలకు, వివిధ పార్టీల నేతలకు తెలుపనుంది. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర పార్టీల నాయకులకు ఈ మూడు రోజుల పర్యటనలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరిస్తుంది.