జాతీయ వార్తలు

60ఏళ్లు దాటితే 50శాతం రాయితీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21:యాభై శాతం రాయితీపై ప్రయాణం చేసేందుకు సీనియర్ సిటిజన్లకు ఎయిర్ ఇండియా మరింత వెసులుబాటు కల్పించింది. ఈ రాయితీ అర్హత వయోపరిమితిని 63 నుంచి 60 సంవత్సరాలకు తగ్గించింది. అరవై సంవత్సరాలు దాటిన ప్రయాణికులకు ఎకానమీ క్లాస్‌లో పర్యటించేందుకు టికెట్ ధరలో 50శాతం రాయితీని ఇస్తామని ఎయిర్ ఇండియా ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ వెసులుబాటు దేశీయ విమానాలకే వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఈ రాయితీని పొందాలంటే సదరు ప్రయాణికులు ఓటర్ గుర్తింపు కార్డు, పాస్ట్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఎయిర్ ఇండియా జారీ చేసిన సీనియర్ సిటిజన్ కార్డును చూపించాల్సి ఉంటుంది.