జాతీయ వార్తలు
రామానుజుల స్టాంపు విడుదల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 2 May 2017
న్యూఢిల్లీ, మే 1: రామానుజా చార్యుల సహస్ర జయంతి సందర్భంగా స్మారక స్టాంపును ప్రధాని మోదీ సోమవారం విడుదల చేశారు. సమాజం సమష్ఠిగా ముందుకు సాగాలన్నదే రామానుజాచార్యుల జీవిత సందేశ పరమార్థమని మోదీ ఉద్ఘాటించారు. మనుషుల్లో దైవ స్వరూపాన్ని చూసిన రామానుజాచార్యులు దైవ భక్తులందరినీ సమానంగా పరిగణించారని మోదీ శ్లాఘించారు. సమాజంలో అనాదిగా పాతుకుపోయిన దురభిప్రాయాలను పటాపంచలు చేసిన రామానుజాచార్య భారత సమాజ ఉదారత, సహనశీల స్వభావాలను మరింత బలోపేతం చేశారని, ఆయన ఆలోచనలను స్ఫూర్తిగా చేసుకుని ఈ వెయ్యేళ్లలో ఎన్నో సామాజిక ఉద్యమాలు జనించాయని ప్రధాన పేర్కొన్నారు.